ఖర్జూరా పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..!
By: Sankar Mon, 27 July 2020 11:56 AM
ఖర్జురా పండు ..ఇది నచ్చని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు... ఖర్జూరలో రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా ఉంటుంది.ఖర్జురా పండ్లు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇపుడు చూదాం ..
1. రకహీనతతో బాధపడుతున్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
2. ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూరపండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.
3.మూత్రం సాఫీగా కానివారు ఖర్జూరపండు తింటే వారికి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది..మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.
4. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు మంచి మందు..
5.డేట్స్ లో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.
6. రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు
7. హ్యాంగోవర్ ను తగ్గించడంతో ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. తాగింది దిగాలంటే వీటిని తింటే మంచి ఫలితం ఉంటుందంట.