బడ్జెట్ ధర రూ.7 వేలలో కొత్త స్మార్ట్ ఫోన్ ఆగస్టు 18 న ఫ్లిప్ కార్ట్ సేల్ లో
By: chandrasekar Thu, 13 Aug 2020 04:41 AM
బడ్జెట్ ధర రూ.7 వేలలో
కొత్త స్మార్ట్ ఫోన్ ఆగస్టు 18 న ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందుబాటులోనికి రానుంది.
ఐటెల్ విజన్ 1 స్మార్ట్ ఫోన్ 3 జీబీ ర్యామ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో
2 జీబీ
ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే
లాంచ్ అయింది. ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు లాంచ్ చేసారు.
దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు 2 జీబీ ర్యామ్ మోడల్ తరహాలోనే ఉన్నాయి. ఇందులో 4000
ఎంఏహెచ్ బ్యాటరీ, వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు
అందుబాటులో ఉన్నాయి.
ఐటెల్ విజన్ 1 లో 3 జీబీ
ర్యామ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ మరియు ధర వివరాలు:
* ఈ స్మార్ట్ ఫోన్ లో 6.09 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్
డిస్ ప్లేను అందించారు.
* ఇందులో 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో
ఉన్నాయి. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.
* ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ
ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
* ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
* ఈ ఫోన్లో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో
ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ కాగా, 0.08 మెగా పిక్సెల్ డెప్త్
సెన్సార్ ను కూడా అందించారు.
* సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 5 మెగా
పిక్సెల్ కెమెరా ఉంది.
* ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు.
* వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతోపాటు
ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
* ఇందులో 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని
మందం 0.85
సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్
ధరను మనదేశంలో రూ.6,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఆగస్టు 18 నుంచి
సేల్ కు వెళ్లనుంది. గ్రేడియేషన్ బ్లూ, గ్రేడియేషన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో
ఉంటుంది.