Advertisement

కలిసి పనిచేయనున్న టెక్ దిగ్గజాలు

By: Sankar Fri, 19 June 2020 9:16 PM

కలిసి పనిచేయనున్న టెక్ దిగ్గజాలు



ఇండియన్ ఐటీ చరిత్రలో రెండు దిగ్గజ కంపెనీలు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఐబీఎం లు కలిసి పనిచేయనున్నామని ప్రకటించాయి ..ఈ రెండు దిగ్గజ కంపెనీల కలయికతో ఒక్కసారిగా ఐటీ రంగం షాక్కు గురి అయింది ..అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్ లకు మెరుగైన సేవలను అందించేందుకు తాము ఐబీఎం తో కలిసి పనిచేసునేందుకూ నిర్ణయం తీసుకున్నామని టీసీఎస్‌ తెలిపింది..అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్‌ క్లౌడ్‌ యూనిట్‌ను టీసీఎస్‌ ప్రారంభించనుంది.

అయితే ఇదివరకే ఇదివరకు డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ... కాగా భవిష్యత్తులో డిజిటల్‌ రంగం సృష్టించబోయే నూతన అప్లికేషన్స్‌ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్‌ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు.

వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా క్లౌడ్‌ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎమ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోబ్‌ లార్డ్‌ పేర్కొన్నారు. టీసీఎస్,‌ ఐబీఎమ్‌ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్‌ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎమ్‌ కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :
|
|

Advertisement