Advertisement

స్మార్ట్‌ఫోన్ వివో Y30 భారత్‌లో లాంచ్

By: chandrasekar Sat, 04 July 2020 3:34 PM

స్మార్ట్‌ఫోన్ వివో Y30 భారత్‌లో లాంచ్


చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో తన వై సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y30ని భారత్‌లో లాంచ్‌ చేసింది. వై30 ఫోన్‌ను వివో ముందుగా మలేషియాలో విడుదల చేసింది. నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఫోన్లు విక్రయించనున్నారు.

వివో వై30లో క్వాడ్‌ కెమెరా, హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే డిజైన్‌, వెనుకవైపు ఫింగర్‌ ప్రింగ్‌ స్కానర్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. 4జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,990గా నిర్ణయించారు స్మార్ట్‌ఫోన్‌ డాజిల్ బ్లూ, ఎమరాల్డ్‌ బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫోన్ ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.47అంగుళాలు
ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో పీ35
రియర్‌ కెమెరా: 13+8+2+2 మెగా పిక్సల్‌
ఫ్రంట్‌ కెమెరా: 8 మెగా పిక్సల్‌
ర్యామ్‌: 4జీబీ
స్టోరేజ్‌: 128జీబీ
బ్యాటరీ: 5000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

Tags :
|
|

Advertisement