మండుతున్న పెట్రోల్ ధరలు ..
By: Sankar Fri, 28 Aug 2020 3:47 PM
స్వల్ప విరామం తరువాత పెట్రోలు ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పెట్రోలు ధరను పెంచుతూ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. దీంతో హైదరాబాద్లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.85.15కు చేరింది. డీజిల్ ధర రూ.80.17 వద్ద నిలకడగా కొనసాగింది.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.86.72కు చేరింది. డీజిల్ ధర రూ.81.32 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.86.28కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 11 పైసలు పెరిగింది. రూ.81.94కు చేరింది. డీజిల్ ధర నిలకడగా రూ.73.56 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.88.58కు చేరింది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా ఉంది.