ఇన్సూరెన్స్ కంపెనీలలో భారీగా ఉద్యోగాలు
By: Sankar Sun, 31 May 2020 11:51 AM
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం మీద అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు ..చాల కంపెనీలు దాదాపు రెండు నెలలపాటు మూత పడటంతో నష్ట నివారణ చర్యలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి..
.అయితే తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీలు నిరుద్యోగులకు పండగ లాంటి విషయాన్ని ప్రకటించాయి. త్వరలోనే ఇన్సూరెన్స్ విభాగంలో 5,000 పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. అయితే నైపుణ్యమున్న అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని కంపెనీలకు చెందిన ముఖ్య ప్రతినిధులు తెలిపారు. పీఎన్బీ మెట్ లైఫ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ 1,500 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది చివరి నాటికి మరో 3,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. మరో వైపు కెనరా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్లు ఇన్సురెన్స్ విభాగంలో జూన్ నాటికి 1,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. టాటా, రిలయన్స్ నిప్పాన్లు 800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నాయి.దీనితో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు