Advertisement

  • ప్రతి ఉదయం అల్పాహారం తీసికోకపోతే కలిగే నష్టాలూ

ప్రతి ఉదయం అల్పాహారం తీసికోకపోతే కలిగే నష్టాలూ

By: chandrasekar Wed, 24 June 2020 6:26 PM

ప్రతి ఉదయం అల్పాహారం తీసికోకపోతే కలిగే నష్టాలూ


ప్ర‌తిరోజూ ఉదయం అల్పాహారం తీసికోకపోతే ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. ఇది ఆరోగ్యంలో అత్యంత కీల‌క పాత్ర పోషిస్తుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తే లేనిపోని రోగాల‌న్నీ వ‌స్తాయి. రోజును ఉత్సాహంగా ప్రారంభించాలంటే బ్రేక్‌ఫాస్ట్ త‌ప్ప‌నిస‌రి. కానీ ఈ బిజీ లైఫ్‌లో తీరిక లేక చాలామంది అల్పాహారం తిన‌డం మానేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే జ‌రిగే అన‌ర్థాలు గురించి త‌ప్ప‌కుండా అంద‌రూ తెలుసుకోవాలి.

* ప్రతిరోజు అల్పాహారం తీసుకోక‌పోవడం వల్ల అల్సర్ వ్యాధికి లోనవుతారు. గొంతులో మరియు కడుపులో మంట ఏర్పడి అల్సర్ వ్యాధికి దారి తీస్తుంది.

* అల్పాహారం తీసుకోక‌పోతే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎక్కువ‌గా బ‌రువు పెరిగే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

* బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుంటే మెద‌డు కూడా మొద్దుబారిపోతుంది. అల్పాహారం మెద‌డుకు గ్లూకోజ్‌గా ప‌నిచేస్తుంది. తిన‌క‌పోవ‌డం వ‌ల్ల ప‌ని ప‌ట్ల ఆస‌క్తి త‌గ్గిపోతుంది.

* బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతోపాటు అధిక ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్ పెరుగ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

* ఈ స‌మ‌స్య‌ల‌తో గుండెపోటుకు దారితీస్తుంది.

* ముఖ్యంగా మ‌హిళ‌లు బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుండా అస‌లు ఉండ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌రిగ్గా రాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయ‌ని ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది.

* బ్రేక్‌ఫాస్ట్ తినేట‌ప్పుడు రోజుకో స‌మ‌యం కాకుండా ప్ర‌తిరోజూ ఒక స‌మ‌యాన్నే ఫాలో అవ్వాలి. లేదంటే గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

Tags :
|
|

Advertisement