ప్రతి ఉదయం అల్పాహారం తీసికోకపోతే కలిగే నష్టాలూ
By: chandrasekar Wed, 24 June 2020 6:26 PM
ప్రతిరోజూ ఉదయం
అల్పాహారం తీసికోకపోతే ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. ఇది ఆరోగ్యంలో అత్యంత
కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తే లేనిపోని రోగాలన్నీ
వస్తాయి. రోజును ఉత్సాహంగా ప్రారంభించాలంటే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. కానీ ఈ
బిజీ లైఫ్లో తీరిక లేక చాలామంది అల్పాహారం తినడం మానేస్తున్నారు. ఇలా చేయడం వల్ల
ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రేక్ఫాస్ట్ తినకుంటే జరిగే అనర్థాలు గురించి తప్పకుండా
అందరూ తెలుసుకోవాలి.
* ప్రతిరోజు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల అల్సర్
వ్యాధికి లోనవుతారు. గొంతులో మరియు కడుపులో మంట ఏర్పడి అల్సర్ వ్యాధికి దారి
తీస్తుంది.
* అల్పాహారం తీసుకోకపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్
పెరిగిపోతుంది. ఎక్కువగా బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
* బ్రేక్ఫాస్ట్ తినకుంటే మెదడు కూడా
మొద్దుబారిపోతుంది. అల్పాహారం మెదడుకు గ్లూకోజ్గా పనిచేస్తుంది. తినకపోవడం వల్ల
పని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.
* బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మధుమేహం వచ్చే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగడానికి కారణమవుతుంది.
* ఈ సమస్యలతో గుండెపోటుకు దారితీస్తుంది.
* ముఖ్యంగా మహిళలు బ్రేక్ఫాస్ట్ తినకుండా అసలు ఉండకూడదు.
ఇలా చేయడం వల్ల నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని
ఓ సర్వేలో వెల్లడైంది.
* బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు రోజుకో సమయం కాకుండా
ప్రతిరోజూ ఒక సమయాన్నే ఫాలో అవ్వాలి. లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.