చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
By: chandrasekar Sat, 04 July 2020 11:32 AM
రోడ్డు ప్రమాదంలో
చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్తూ మరో నలుగురు దుర్మరణం చెందారు. చిత్తూరు
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలంలోనే నలుగురు మృతి
చెందారు. చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
అయ్యాయి.
కలకడ మండలం చిత్తూరు
రాయచోటి జాతీయ రహదారి ఉసిరికాయల పంట కట్టమీద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
కలకడ మండలంలో మహేష్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అతని చూసేందుకు వెంకటరమణ, అతడి
కుటుంబసభ్యులు ఓ ఆటోలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. వారు
ప్రయాణిస్తున్న ఆటో లారీ ఢీకొన్నాయి.
ఆటోలో ప్రయాణిస్తున్న వెంకట రమణ, ఆయన
పెద్ద భార్య, చిన్న భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోడ్రైవర్ పీలేరు
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.