Advertisement

  • వెల్లులి , తేనె కలిపి పొద్దునే తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..

వెల్లులి , తేనె కలిపి పొద్దునే తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..

By: Sankar Tue, 21 July 2020 3:10 PM

వెల్లులి , తేనె కలిపి పొద్దునే తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..



ఆరోగ్యానికి వెల్లుల్లి మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కూడా. అదే విధంగా తేనె కూడా.. శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉంటాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే చాలా మంది టీ, కాఫీలు తీసుకుంటారు. అయితే, వాటికంటే ముందుగా ఈ తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

1. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. దీని వల్ల శరీరం ఎలాంటి ఇన్ఫక్షన్స్‌నైనా ఎదుర్కొంటుంది..

2. సీజన్ మారినప్పుడు వేధించే జలుబు, జ్వరం, సైనస్ వంటి సమస్యలు ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి..

3. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్స్‌ ఈ మిశ్రమం దూరం చేస్తుంది. దీంతో పాటు శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.

4. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటి సమస్యలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.

5. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. అదే విధంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తసరఫరా కూడా మెరుగు అవుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. దీని వల్ల నొప్పులు, వాపులను తగ్గుతాయి.. గొంతు నొప్పి, మంట వంటి సమస్యలు కూడా అంతగా వేధించవు.

Tags :
|
|
|

Advertisement