కొబ్బరినూనెలో రోగనిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం
By: chandrasekar Wed, 08 July 2020 4:57 PM
కరోనా వైరస్ కట్టడి కోసం
సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా రోజుల
సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్తో పోరాడి నిలవడం ఒక్కటే మన వద్ద ఉన్న
మార్గం. ఇందుకు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండాలి. ఇందుకు
ఎన్నో రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.
తాజాగా ‘కొబ్బరి నూనె’తో
కరోనా కట్టడి అంశం చర్చనీయమైంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులతో
పోల్చితే కేరళలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే, వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువే.
ఇందుకు కేరళ ప్రజల ఆహార అలవాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రజలు
ఎక్కువగా కొబ్బరి నూనె వంటకాలను తీసుకుంటారని, అదే
వారి ఆరోగ్య రహస్యమని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది.
జర్నల్ ఆఫ్ పిజీషియన్స్
అసోసియేషన్ ఈ అధ్యయాన్ని ప్రచురించింది. ఈ స్టడీ టీమ్లో ఒకరైన డాక్టర్ శశాంక్
జోషి మాట్లాడుతూ ‘‘కేరళ ప్రజలు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడతారు. అందుకే కరోనా
మహమ్మారిపై గట్టిగా పోరాడగలుగుతున్నారు. కొబ్బరినూనెలో రోగనిరోధక శక్తిని పెంచే
కారకాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబయల్
కారకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రక్రియకు కీలకమైన యాంటీ ఇన్
ఫ్లమేటరీ వ్యవస్థను క్రియాశీలకంగా మార్చుతాయి’’ అని తెలిపారు.
ఈ స్టడీలో మరికొన్ని
ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కరోనా పై పోరాడగలిగే ఉత్పత్తులను కనుగొనాలని
ప్రభుత్వం ఆయుర్వేద సంస్థలకు సూచించిన నేపథ్యంలో ఈ స్టడీ నిర్వహించినట్లు JAPI
పేర్కొంది. 4 వేల
ఏళ్ల కిందటే కొబ్బరి నూనెను హెల్త్ డ్రింక్గా ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్లు
స్పష్టం చేసింది. అయితే, కొబ్బరి
నూనె మానవ శరీరంలో ఇమ్యూనోమాడ్యులేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అయితే, ఇది మనుషుల్లో ఎలా పనిచేస్తుందనే విషయంపై చాలా తక్కువ
ప్రయోగాలు జరిగాయని వెల్లడించింది. కొబ్బరి నూనె కరోనాపై పోరాడటం మాట ఎలా ఉన్నా
అది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందనేది మాత్రం వాస్తవం. కరోనా వైరస్కు మందులేదు.
నిపుణులు అధ్యయనంలో అంశాలనే ఇక్కడ అందించామని గమనించగలరు. కొబ్బరి నూనెను ఆహారంగా
తీసుకొనే ముందు తప్పకుండా వైద్యులను, ఆహార
నిపుణులను సంప్రదించగలరని మనవి.