కీరదోస నీటి యొక్క ఉపయోగాలు
By: chandrasekar Thu, 18 June 2020 2:40 PM
కీర తినడం వల్ల శరీరానికి
చల్లదనాన్నిస్తుంది. వాటిముక్కలు ఒత్తిడిని దూరం చేస్తాయి, ఇకపోతే
కీరముక్కలను నానబెట్టిన నీరు కూడా ఆరోగ్యానిక మేలు చేస్తాయి. వినడానికి కొత్తగా
ఉన్నా ఇది పచ్చి నిజం. అదెలాగో దాని విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
* కీరదోసను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
దీన్ని లీటర్ నీటిలో వేసి ఆ మిశ్రమాన్ని
రెండు గ్లాసలు చొప్పున తాగాలి.
* ఈ నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
* గుండె జబ్బులను నియంత్రిస్తుంది.
* రక్తపోటు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాదు డయాబెటిస్ నుంచి కూడా
కాపాడుతుంది.
* కీరదోస నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి. ఇవి అల్జీమర్స్ రాకుండా నియంత్రిస్తుంది.
* ఇందులో విటమిన్ కె ఉంటుంది. దీంతో ఎముకలు పెలుసుబారడం
తగ్గుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంతోపాటు చర్మం కాంతివంగా
మెరుగుపడడానికి తోడ్పడుతుంది.
* కీరదోస నీటిని తాగడం వల్ల కండరాలకు కావాల్సిన
పోషకాలు కూడా అందుతాయి.
* బరువు తగ్గించడంలో ఈ నీళ్లు ఎంతో బాగా పని చేస్తాయి.
అంతే కాదు ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టనిండినట్టు
అనిపిస్తుంది.
* ఈ కీర నీళ్లలో విటమిన్-కె, మాంసకృత్తులు
ఎక్కువ ఉంటాయి.