Advertisement

  • కరోనా హెల్త్ బులెటిన్‌ విడుదల.. 997 కేసులు మాత్రమే నమోదు...!

కరోనా హెల్త్ బులెటిన్‌ విడుదల.. 997 కేసులు మాత్రమే నమోదు...!

By: Anji Fri, 13 Nov 2020 11:11 AM

కరోనా హెల్త్ బులెటిన్‌ విడుదల.. 997 కేసులు మాత్రమే నమోదు...!

తెలంగాణలో గురువారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం మొత్తం 997 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,55,663 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,094గా ఉన్నాయి. మరో 14,466 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో 1222 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో నలుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1397కి చేరింది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 169 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది.

మరోవైపు, తెలంగాణలో గురువారం ఒక్కరోజే 42,163 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 997 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 48 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 391 మంది ఫలితాలు తేలాల్సి ఉంది.

Tags :
|

Advertisement