సున్నితమైన చర్మం కోసం కొబ్బరిపాలు
By: chandrasekar Fri, 12 June 2020 7:20 PM
చర్మ సౌందర్యం కోసం
తాపత్రయపడని వారుండరు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే
రసాయనిక క్రీమ్స్ వాడుతుంటారు. ఫలితంగా ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటారు. ఈ
చిట్కాలు పాటిస్తే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
* గులాబి రేకులు, ఒక స్పూన్ తేనె, అరకప్పు కొబ్బరి పాలను ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో
వేసుకొని స్నానం చేయాలి. దీనివల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతివంతంగా
తయారవుతుంది.
* గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్వాటర్, కొబ్బరి
పాలు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల
నిర్జీవమైన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కొబ్బరిపాలను నేరుగా
చర్మానికి అప్లై చేసుకొని సాఫ్ట్గా మర్దనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి తేమ
అందుతుంది.
* ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్ చొప్పున బాదం
పొడి, తులసి
పొడి, రెండు
చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత
నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మృతకణాలు
తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
* కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి 10
నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే
ముఖంపై పేరుకున్న మురికి తొలిగి తాజాగా మారుతుంది.