Advertisement

  • రక్త దానం చేయండి ..ప్రాణదాతలు అవ్వండి ..చిరంజీవి ట్వీట్

రక్త దానం చేయండి ..ప్రాణదాతలు అవ్వండి ..చిరంజీవి ట్వీట్

By: Sankar Sun, 14 June 2020 4:28 PM

రక్త దానం చేయండి ..ప్రాణదాతలు అవ్వండి ..చిరంజీవి ట్వీట్


ప్రాణం కన్నా విలువైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి విలునవైన ఓ ప్రాణాన్ని రక్తదానం చేసి రక్షించడం కన్నా గొప్ప సంతృత్తి కూడా ఇంకోటి లేదనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇదే విషయాన్ని చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. నేడు (జూన్ 14) ప్ర‌పంచ రక్తదాన దినోత్స‌వం సందర్భంగా ఓ స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేస్తూ జనాలను మేలుకొలిపే మంచి సందేశమిచ్చారు చిరంజీవి.

ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని ప్రశ్నించిన ఆయన.. ''ర‌క్త‌దానం చేసి మ‌రొక‌రి జీవితాన్ని కాపాడ‌టంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదు. ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి, చాలా మంది ర‌క్తం దానం చేస్తున్నార‌ని తెలిసి సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌వుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు. రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

chiranjeevi,blood bank,blood donation,life save,tweet , మెగాస్టార్, ర‌క్త‌దానం,  ర‌క్తం,  చిరంజీవి, ప్రాణం



పలు సందర్భాల్లో తాను రక్తదానం చేస్తున్నప్పటి ఫోటోలు జోడిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో 'ఠాగూర్' సినిమాలోని ''నేను సైతం'' సాంగ్ ప్లే చేస్తూ రూపొందించిన వీడియో షేర్ చేశారు చిరు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నేనుసైతం రక్తదానానికి సిద్ధం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ తరఫున‌ ద్వారా మెగాస్టార్ పలు సేవలు చేస్తున్న విషయం తెలిసిందే.

సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న చిరంజీవి.. ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ అతిత్వరలో తిరిగి ప్రారంభం కానుంది.


Tags :

Advertisement