మధుమేహనికి విటమిన్లు మరియు పీచు పదార్థం అధికంగా వున్న పండ్లు చేసే మేలు
By: chandrasekar Thu, 11 June 2020 8:26 PM
కూరగాయలతో పోలిస్తే
శరీరానికి అవసరమైన లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం పండ్ల ద్వారానే ఎక్కువగా లభిస్తాయి.
అయితే, వీటిలో
కార్పోహైడ్రేట్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధుమేహ రోగులు ఏ పండ్లు
ఎక్కువగా తినవచ్చో తెలుసుకుందాం.
జామకాయ: ఇది డయాబెటిస్ కు
మంచి ఔషదం. ఇది అధిక మొత్తంలో ఫైబర్లను కలిగి ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను
తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.
నేరేడు: నేరేడు పండ్లు
రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. నేరేడు పండులోని గింజల్ని పొడి చేసి
రోజూ తీసుకున్నా షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
బొప్పాయి: ఇందులో
హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి డయాబెటిస్ రోగులను రక్షించే ఎంజైములు ఉంటాయి.
బొప్పాయిలో ఉండే ప్లెతోరా న్యూట్రియంట్స్ మధుమేహాన్ని నివారిస్తాయి. డయాబెటిస్
వల్ల ఏర్పడే గుండె సమస్యలను అడ్డుకుంటాయి.
దానిమ్మ: రక్తంలోని
చక్కెరను నియంత్రించే శక్తి దానిమ్మలో ఉంది. ఫ్రక్టోజ్, పీచు
పదార్థంలో గ్లైసిమిక్ ఇండెక్స్ను బాగా తగ్గించే గుణం ఉంది.
యాపిల్: ఇందులో యాంటీ
ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్ కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి
తోడ్పడుతుంది.
అంజీర: ఇందులో ఫైబర్
ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ సక్రమంగా పనిచేసేందుకు ఇది
తోడ్పడుతోంది.
చెర్రీస్: వీటిలో ఉండే
విటమిన్ సి, ఐరన్, బీటా కెరోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్
అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఆంథోసియానిన్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని 50
శాతానికి పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
బెర్రీస్: రాస్
బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్
బెర్రీస్, క్రాన్
బెర్రీస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. విటమిన్స్, యాంటీ
ఆక్సిడెంట్స్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. రక్తంలోని చక్కర
నిల్వలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.