Advertisement

మారుతీ సుజుకీ ఇండియా తాజాగా అదిరిపోయే స్కీమ్‌

By: chandrasekar Wed, 27 May 2020 2:54 PM

మారుతీ సుజుకీ ఇండియా తాజాగా అదిరిపోయే స్కీమ్‌


దేశీ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా అదిరిపోయే స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిటైల్ ఫైనాన్స్ సర్వీసులు లాంచ్ చేసింది. దీని కోసం మారుతీ సుజుకీ కోరమండలం ఇన్వెస్ట్‌‌మెంట్ అండ్ ఫైనాన్స్ సంస్థతో ఏకమైనది. బై బైనౌ పే లేటర్ ఆఫర్‌ను విడుదల చేసింది.

బై నౌ పే లేటర్ ఆఫర్ కింద సులభంగానే రుణం పొందొచ్చని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా కరోనా వైరస్ నేపథ్యంలో మారుతీ సుజుకీ తన కార్ల కస్టమర్లకు రెండు నెలల మారటోరియం సదుపాయం కూడా కల్పిస్తోంది. అంటే కస్టమర్లు ఇప్పుడు లోన్ తీసుకుంటే 60 రోజుల తర్వాత ఈఎంఐ కట్టడం ప్రారంభించొచ్చు.

లోన్ మారటోరియం ఆప్షన్ కేవలం ఎంపిక చేసిన కార్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. జూన్ 30 వరకు పొందే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో లిక్విడిటీ ఎదుర్కొంటున్న కస్టమర్లకు తాజా స్కీమ్‌తో ప్రయోజనం కలుగుతుందన్నారు. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర కుండు మాట్లాడుతూ మారుతీ సుజుకీ ఇండియా భాగస్వామ్యంతో కార్ ఫైనాన్స్ విభాగంలోనూ దూసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. కారు ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చని తెలిపారు. అలాగే దీర్ఘకాల రీపేమెంట్ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు.

maruti,suzuki,india,offers,latest scheme ,మారుతీ, సుజుకీ, ఇండియా, తాజాగా, అదిరిపోయే స్కీమ్‌


అలాగే ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా వినూత్నమైన ఫైనాన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా కారు కొనుగోలుపై తగ్గింపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. టాటా మోటార్స్ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌లో భాగంగా సులభంగానే రుణాలు అందిస్తోంది. కోవిడ్ 19 వారియర్స్‌ను ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. టాటా టియాగోపై స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కస్టమర్లు ఈ కారును కేవలం రూ.5,000 నెలవారీ ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Tags :
|
|
|
|

Advertisement