Advertisement

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు

By: Anji Tue, 15 Sept 2020 1:24 PM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నవారికి ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎంసీఎల్ఆర్‌లో 0.05 శాతం కోత విధించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలుగనుంది.సెప్టెంబర్ 15 నుంచి అంటే ఈరోజు నుంచే ఎంసీఎల్ఆర్ రేటు కోత అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.15 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. కేవలం ఏడాది కాల పరిమితిలోని ఎంసీఎల్ఆర్‌తో పాటు బ్యాంక్ మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటులో కూడా కోత విధించింది. రేట్ల కోత నిర్ణయంతో బ్యాంక్ మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.85 శాతానికి దిగొచ్చింది.

అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7 శాతానికి తగ్గింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు నేపథ్యంలో బ్యాంక్ నుంచి ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుంది. ఈఎంఐ భారం దిగివస్తుంది. కాగా గత వారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర బ్యాంకులు కూడా ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించేశాయి. ఇవి వరుసగా 0.05 శాతం, 0.10 శాతం, 0.10 శాతం చొప్పున ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించేసింది. దీంతో ఈ బ్యాంక్ కస్టమర్లకు కూడా బెనిఫిట్ లభిస్తుంది.

Tags :
|
|

Advertisement