Advertisement

ఊటీ వింతలు విశేషాలు

By: Sankar Wed, 26 Aug 2020 5:08 PM

ఊటీ వింతలు విశేషాలు


ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది ఊటీగా సంక్షిప్తీకరించబడింది. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లా లో ఒక భాగం. ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి బాధ్యత వహిస్తాయి.

ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అనికూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి. కొండలపై సమృద్ధిగా పెరుగుతున్న యూకలిప్టస్ చెట్లనుండి ప్రసరించే నీలం పొగవల్ల పర్వతాలు నీలంగా ఉంటాయి అని స్థానికుల అభిప్రాయం.

ఊటీ లేక్ :

ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లోసుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. ఈ సరస్సు సమీపంలో ఒక బస్సు స్టాండ్, ఒక రేస్ కోర్స్ మరియు ఒక పార్క్ నిర్మించటం వలన మరియు భౌగోళిక కారణాలుగా కుచించుకు పోయింది. ప్రస్తుతం బోటు విహారాల కారణంగా నే ప్రసిద్ధి చెందినది. బోటు విహారం చేస్తూ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది.

దొడ్డ బెట్ట శిఖరం :

నీలగిరులలో దోద్దబెట్ట శిఖరం అతి పొడవైనది. కన్నడంలో దొడ్డ బెట్ట అంటే, పెద్ద కొండ అని అర్ధం చెపుతారు. ఇది సుమారు 8650 అడుగుల పొడవు వుంటుంది. ఊటీ సిటీ నుండి ఈ శిఖరం 9కి.మీ. ల దూరంలో ఊటీ - కోటగిరి రోడ్ లో కలదు. ఇక్కడ నుండి చాముండి హిల్స్ చక్కగా చూడవచ్చు. దోద్దబెట్ట శిఖరం నుండి కుల్కూడి, కట్ట దాడు మరియు హేకుబా శిఖరాలు కూడా చూడవచ్చు. ఈ మూడు శిఖరాలు ఉదగమండలంకు సమీపం. దోద్దబెట్ట శిఖరం వాస్తవంగా బల్లపరుపుగా వుండటం విశేషం. టూరిస్ట్ సీజన్లో ఏప్రిల్ మరియు మే నెలలలో సుమారు 3,500 మంది పర్యాటకులు రోజుకు దీనిని సందర్శిస్తారు. ఈ శిఖర ఆకర్షణ పెంచేందుకు ప్రభుత్వం ఇక్కడే శిఖరం పైన ఒక ఖగోళ అబ్సర్వేటరీ ఏర్పాటు చేసింది. ఇక్కడ రెండు టెలీస్కోప్ లు కలవు. వీటి నుండి పర్యాటకులు వాలీ దృశ్యాలు చూడవచ్చు.

పైకారా సరస్సు:

ప్రకృతి చాలా అందమైనది అనేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రదేశం ముడుమలై నేషనల్ పార్క్ కు 30 కి.మీ.ల దూరంలో వుంటుంది. అనేక సుందర సుందర దృశ్యాలు, పచ్చని నీరు ఈ సరస్సు అందాలను మరింత అధికం చేసాయి. నీలగిరి జిల్లాలో ఇది అతి పెద్ద సరస్సు. ఇక్కడి తోడా తెగ ప్రజలు దీనిని పవిత్ర సరస్సు గా భావిస్తారు. పైకారా లేక్ సమీపం లో కల విశాలమైన వెన్ లాక్ డౌన్స్ మైదాన ప్రదేశం స్థానికులకు, టూరిస్టులకు ఒక పిక్నిక్ ప్రదేశం. ఈ లేక్ వద్ద తమిళ్ నాడు టూరిజం శాఖ ఒక బోటు విహారం కూడా ఏర్పరచింది

ఊటీ చేరుకునే మార్గాలు

రోడ్డుమార్గం ద్వారా ఊటీ ప్రధాన నగరాలకు, పట్టణాలకు మంచి రోడ్ల ద్వారా అనుసంధానించబడి ఉంది. దీనిని చెన్నై, కోయంబత్తూర్, మైసూర్, బెంగళూర్ , కోచి, కాలికట్ వంటి నగరాల నుండి తేలికగా చేరుకోవచ్చు. అనేకమంది ప్రజలు ఊటీకి ప్రైవేట్ టాక్సీల కంటే ఎంతో సౌకర్యవంతంగా అదేవిధంగా ఖర్చు తక్కువగా ఉండే రాష్ట్ర౦ నడిపే రవాణా బస్సులకు ప్రాధాన్యతను ఇస్తారు. మీరు మీ సొంత వాహనాల పై రోడ్డు మార్గంలో రావాలనుకుంటే, మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఊటీకి ఇతర మార్గాలను కూడా తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

రైలుమార్గం ద్వారా ఊటీతో కలిపి భారతదేశం లోని మిగిలిన ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే అనుసంధానించబడి ఉంది. ఊటీకి ప్రతిరోజూ రాత్రి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఉదగమండలం ఊటీ రైల్వే స్టేషన్, మేట్టుపలయం స్టేషన్ వద్ద రైలుల్ మారాలి ఎందుకంటే ఊటీకి కేవలం మీటర్ గేజ్ లైన్ వెళ్తుంది. నిజానికి, నీలగిరి మౌంటెన్ సర్వీస్ భారతదేశంలోని పురాతన మౌంటెన్ రైల్వే ట్రాక్ లలో ఒకటి.

విమానమార్గం ద్వారా ఊటీలో స్థానిక, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. కోయంబత్తూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.











Tags :
|

Advertisement