వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు...
By: chandrasekar Fri, 18 Dec 2020 9:06 PM
గుంటూరులో మూడు
రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ర్యాలీ చేశారు. రాజధానిపై రెఫరెండంతో రాజీనామా
చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసరారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు
కూడా సవాల్ విసిరారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికి నష్టం ఉండదన్నారు
ఎమ్మెల్యే మద్దాలి గిరి. మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదన్నారు.
జగన్ తమ అధినాయకుడని ఆయన చెప్పిన బాటలో నడవాలి కాబట్టి ఆయన ఓకే అంటే ఆ మరు క్షణమే
రాజీనామా చేస్తాను అన్నారు.
రాజధాని రెఫరెండతో
రాజీనామాకు తాను సిద్ధమన్నారు ఎమ్మెల్యే ముస్తఫా జగన్ ఆదేశిస్తే వెంటనే రాజీనామా
చేసి ఎన్నికలకు వెళ్తాను అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా సంచలన
వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులా అమరావతా అనే దానిపై రెఫరెండంకు మేము రెడీ
అన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి తేల్చుకునేందుకు రావాలి
అన్నారు.