సరిహద్దుల్లో సైనిక నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నాం
By: chandrasekar Wed, 30 Sept 2020 5:55 PM
చైనా-భారత సరిహద్దులోని
పశ్చిమ చైనా భూభాగాన్ని భారతదేశ పరిపాలనా అధికారంలోకి చేర్చడాన్ని చైనా ఎప్పుడూ
వ్యతిరేకిస్తుందని పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి స్థిరమైనదని, ఎప్పుడూ
మారలేదని తెలిపింది. సరిహద్దుల్లో సైనిక నిర్మాణాలు చేపట్టడాన్ని తాము
వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్లోని
మనాలీ నుంచి లఢక్లోని లేహ్ వరకు సొరంగ మార్గాన్ని భారత్ నిర్మించడంపై మీడియా
అడిగిన ఒక ప్రశ్నకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ను ఈ మేరకు
సమాధానం ఇచ్చారు.
సరిహద్దు ప్రాంతంలో
పరిస్థితులను క్లిష్టతరం చేసే కార్యకలాపాలను భారతదేశం లేదా చైనా చేపట్టకూడదని ఆయన
అన్నారు. నియంత్రణ రేఖ అవతలి వైపున ఉన్న చైనా భూభాగంలోనే మౌలిక సదుపాయాలను
నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఏసీ సమీపంలో కొత్తగా సైనిక శిబిరాలను
నిర్మించినట్లు వస్తున్న వార్తలను వాంగ్ తోసిపుచ్చారు.