హాగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్
By: Sankar Sun, 13 Dec 2020 6:37 PM
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే కేవలం మైదనంలో పదకొండు మంది ఆటగాళ్లతో మాత్రమే కాకుండా మైదానం బయట ఆ జట్టు మాజీ ఆటగాళ్లతో కూడా తలపడాల్సి ఉంటుంది.అయితే మైదానంలో ఆటతో తలపెడితే మైదానం బయట మాత్రం వారి మాటలతో తలపడాలి...తాజాగా ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మరి కొద్దీ రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ టీం ఇండియా ఆటగాళ్ల మీద విమర్శలు గుప్పించాడు...
టీమిండియా టాప్ ఆర్డర్ ఆఫ్స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి.. అలాగే ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు.. కానీ ఇలాంటి నియమాలేవి పాటించని టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నారంటూ' ట్రోల్ చేశాడు. హాగ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు..
హాగ్.. మా మీద పడి ఏడ్వడం కంటే ముందు మీ జట్టు టాప్ ఆర్డర్ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో నాలుగురోజులు గడిస్తే భారత్తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీ జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్ ఇచ్చాడు.