విశాఖ పర్యటన రద్దు; రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లనున్న చంద్రబాబు
By: chandrasekar Mon, 25 May 2020 12:19 PM
తెలుగు దేశం పార్టీ
అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటన
రద్దు అయింది. సోమవారం విశాఖపట్నం, విజయవాడకు
విమానాలను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. అయితే ఇప్పటికే
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇవ్వడంతో షెడ్యూల్ కూడా
ఖరారైంది. కానీ, అర్ధరాత్రి
విమానాలను రద్దు చేస్తున్నట్లు విమానయాన శాఖ అధికారులు ప్రకటించడంతో విశాఖ పర్యటన
వాయిదా పడింది.
అందువల్ల చంద్రబాబు విశాఖ
పర్యటన రద్దు చేసుకుని రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లనున్నారు. ఈ మేరకు తెలుగు
దేశం పార్టీ ప్రకటించింది. అనంతరం ఈ నెల 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఒక్కరోజే విశాఖ, విజయవాడ
ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ
మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని అచ్చెన్నాయుడు
ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, విశాఖకు విమాన సర్వీసులు రద్దు చేయడంపై టీడీపీ
తీవ్రంగా స్పందించింది. సోమవారం విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు.
సోమవారం ఒక్కరోజే ఏపీకి
విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు
షెడ్యూల్ ప్రకటించాకే ఏపీకి విమాన సర్వీసుల బంద్ చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువని
ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకే సర్వీసులు రద్దు చేశామని హర్దీప్ సింగ్
పురి ట్వీట్ చేశారని, ఈ నెల 26వ తేదీకే ఏపీకి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి
చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు.