కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన రాములమ్మ
By: Sankar Sun, 06 Dec 2020 8:28 PM
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం అయ్యారు సినీ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి ... ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన కీలక నేతలు హాజరయ్యారు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో పాటు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీలో కీలకమైన వ్యక్తి, మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నారు...
అమిత్షాతో భేటీకంటే ముందు.. కిషన్రెడ్డి నివాసంలో భేటీ అయిన విజయశాంతి, బండి సంజయ్, వివేక్... ఆ తర్వాత అంతా కలిసి అమిత్షా దగ్గరకు వెళ్లారు. ఇక, అమిత్షాతో భేటీతో ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తెలియాల్సి ఉండగా... సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకోనున్నారు విజయశాంతి... అప్పుడే పార్టీ సభ్యత్వాన్ని కూడా స్వీకరించనున్నారు..
1998లో మహిళా మోర్చా కార్యదర్శిగా బీజేపీలో రాజకీయ ప్రవేశం చేసిన విజయశాంతి... దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి బీజేపీ గూటికి చేరుకుంటున్నారు... ఇక, మధ్యలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా విజయం సాధించిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు