పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం ..వ్యాన్ బోల్తాపడి పదమూడు మంది సజీవ దహనం
By: Sankar Sun, 27 Sept 2020 11:50 AM
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను బోల్తా కొట్టడంతో భారీ ఎత్తున మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 13 మంది అక్కడిక్కడే సజీవదహనమయ్యారు.
మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి కరాచీ వస్తున్న సమయంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారు కింది భాగంలో ఉంటే టైర్ రాడ్ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసులు తెలిపారు. అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని...దీంతో ప్రయాణికులు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.