Advertisement

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్..

By: Sankar Thu, 17 Sept 2020 11:18 AM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్..


కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకి పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 50 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో రోడ్డురవాణా,రహదారులు,ఎంఎస్‌ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా వైరస్ సోకింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలియ జేశారు. కొద్దిగా అనారోగ్యం అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఆరోగ్యంగానే ఉన్నాననీ, ఐసోలేట్ అయ్యానని చెప్పారు.

అలాగే తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని , ప్రోటోకాల్‌ను అనుసరించాలని అభ్యర్థించారు. సురక్షితంగా ఉండాలని సూచించారు..కాగా ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే..అమిత్ షా కూడా ఇటీవలే కరోనా బారి నుండి బయటపడ్డారు..

Tags :
|

Advertisement