Advertisement

  • యూకే నుంచి తెలంగాణ వచ్చినవారిలో మరొక ఇద్దరికీ కరోనా పాజిటివ్

యూకే నుంచి తెలంగాణ వచ్చినవారిలో మరొక ఇద్దరికీ కరోనా పాజిటివ్

By: Sankar Sun, 27 Dec 2020 9:34 PM

యూకే నుంచి తెలంగాణ వచ్చినవారిలో మరొక ఇద్దరికీ కరోనా పాజిటివ్


బ్రిటన్ లో కొత్త కరోనా మహమ్మారి విజృంభిస్తుంది ..ఇప్పటికే అది బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ , స్పెయిన్ వంటి యూరోప్ దేశాలకు కూడా పాకింది...అయితే ఇప్పటికే కరోనా వలన బాగా దెబ్బతిన్న ఇండియా కొత్త వైరస్ విషయంలో ముందుగానే అప్రమత్తం అయింది..బ్రిటన్ నుంచి వచ్చే విమానాల మీద నిషేధం విధించింది ..అయితే ఈ నిషేధం కంటే ముందు బ్రిటన్ నుంచి ఇండియా వచ్చిన వారికొసం అన్ని రాష్ట్రాలు వెతుకుతున్నాయి...

తాజాగా యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 20 మందిని వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులో అధికారులు ఉంచారు.

వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్‌, ట్రీటింగ్ విధానాన్ని చేపట్టారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి 1,216 మంది రాగా, వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంకా 154 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది...

Tags :
|
|

Advertisement