టీవీఎస్ మోటార్ కంపెనీ వేతనాల కోత
By: chandrasekar Tue, 26 May 2020 2:39 PM
కోవిడ్-19 ఎఫెక్ట్తో ఉద్యోగుల జీతాల్లో కోతను విధిస్తున్నట్టు
టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది . వేతన కోతను ప్రకటించిన దేశంలో తొలి
టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ కావడం గమనార్హం. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్డౌన్తో ఉత్పాదకత, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులందరికీ ఈ ఏడాది మే
నుంచి అక్టోబర్ వరకూ వేతనాలను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ సోమవారం ప్రకటించింది.
దేశవ్యాప్త లాక్డౌన్తో
అమ్మకాలు తీవ్రంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఉద్యోగులకు వేతనాలను బట్టి 5 నుంచి
20 శాతం వరకూ వేతన కోత విధించారు. ఆటోమొబైల్ సేల్స్
దారుణంగా పడిపోవడంతో ఇతర ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగుల్లోనూ వేతన విషయంలో భయం
మొదలైంది.
Tags :
tvs |
motor |
company |
cuts |