ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుంటాము ..కేటీఆర్
By: Sankar Fri, 04 Dec 2020 8:50 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడి అయింది. 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందామని పేర్కొన్నారు. బీఎన్ రెడ్డి కాలనీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్మెట్లో 200, మల్కాజ్గిరిలో 70 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు. ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించిన హైదరాబాద్ ఓటరు మహావయులందరికీ హృదయపూర్వక దన్యావాదాలు తెలిపారు