హోం మంత్రి మహమూద్ అలీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలం...
By: chandrasekar Sat, 05 Dec 2020 5:17 PM
టీఆర్ఎస్కు GHMC ఎన్నికల్లో
ఎంతగా నిరాశాజనక ఫలితాలు వచ్చాయో తెలిసిందే. 2016 మున్సిపల్ ఎన్నికల్లో 99
సీట్లు గెల్చుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు కేవలం 55 స్థానాలతో
సరిపెట్టుకుంది. ఇందుకు ఆ పార్టీ చేసిన అనేక తప్పిదాలు కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాక, టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, హోం
మంత్రిగా ఉన్న మహమూద్ అలీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలం కావడం
ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కనీసం ఒక్క సీటును కూడా తన
ఖాతాలో వేసుకోలేకపోయింది. ఆయన నియోజకవర్గమైన మలక్పేటలో 7
డివిజన్లు ఉన్నాయి. వీటిలో 5 ఎంఐఎం గెలుచుకుంది. మరో 2
బీజేపీ దక్కించుకుంది.
గతంలో ముసారాంబాగ్, సైదాబాద్
డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ జెండా
పాతింది. దీంతో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గతంలో ముసారాంబాగ్, సైదాబాద్
డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ జెండా
పాతింది. దీంతో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.