Advertisement

  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తెరాస...ఎందుకో తెలుసా !

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తెరాస...ఎందుకో తెలుసా !

By: Sankar Mon, 30 Nov 2020 7:03 PM

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తెరాస...ఎందుకో తెలుసా !


జిహెచ్ఎంసి ఎన్నికలను తెరాస , బీజేపీ ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..దుబ్బాక ఉప ఎన్నిక విజయాన్ని కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తుంటే , దుబ్బాక విజయం కేవలం గాలివాటం మాత్రమే అని నిరూపించాలని తెరాస భావిస్తుంది...దీనితో జిహెచ్ఎంసి ఎన్నికల మీద విజయం కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమించాయి...

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,లీగల్ సెల్ అధ్యక్షుడు, టిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ లు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానెల్ బీజేపీ ప్రచారకర్తగా మారింది. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు. రేపు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ సూచించిందన్న ఆయన బీజేపీ మాత్రమే ప్రచారం చేస్తోందని అన్నారు.

ఒక పార్టీని టార్గెట్ గా చేసి కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆయన కొంతమందికి పైసలు ఇచ్చి మాట్లాడిస్తూ.. తిట్టిపిస్తున్నారు అని అన్నారు. హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన బిజెపికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ కథనాల వెనుక ఎవరు ఉన్నారో బయటకు వచ్చేలా చేయాలని అయన అన్నారు. ఈ ప్రయివేటు ఛానెల్ పై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలని అన్నారు. మాయమాటలు, మాయదారి పనులు, మోసం చేయడం బీజేపీకే తెలుసని అన్నారు. .

Tags :
|
|

Advertisement