నిజామాబాదు ఎమ్యెల్సీ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కవిత ఘనవిజయం..
By: Sankar Mon, 12 Oct 2020 11:22 AM
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం సాధించారు. మొదటి రౌండ్లో ఫలితం తేలిపోయింది. అత్యధిక ఓట్లతో కవితనే గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయాయి. కాసేపట్లో అధికారులు గెలుపు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.
మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి పార్టీల వారిగా సాధించిన ఓట్లు చూస్తే.. టీఆర్ఎస్కు 531 బీజేపీకి 39 కాంగ్రెస్కు 22 ఓట్లు చెల్లని ఓట్లు 8గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్కే వచ్చాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్కు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 56 ఓట్లు. కాంగ్రెస్కు 29 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 823 ఓట్లు పోల్ అవ్వగా అందులో 10 ఓట్లు చెల్లలేదు..
మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్లో లెక్కించనున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. విజయానికి అవసరమైన ఓట్లను కవిత ఇప్పటికే సాధించారు.ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒక ఓటరు మరణించగా, కరోనా కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిథులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటేశారు.ఈ ఎన్నికల్లో తెరాస తరపున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ తరపున సుభాష్రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీపడ్డారు.