మహిళ ముక్కు, చెవులు కోసి ఒంటిపై నగలు ఎత్తుకెళ్లిన దొంగలు...
By: chandrasekar Thu, 29 Oct 2020 7:29 PM
నిజామాబాద్ జిల్లాలోని
బోధన్ పట్టణంలో దొంగలు స్థానిక మహిళ (55)
ముక్కు, చెవులు కోసి ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లిపోయారు.
రాకాసిపెట్కు చెందిన లక్ష్మీ అనే మహిళపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేశారు.
ఆమె ఒంటిపై నగలు
దోచుకెళ్లిన తరువాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. బాధితురాలైన ఈ మహిళ
బోధన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న మహిళగా గుర్తించారు.
ఉదయం అక్కడ స్పృహ
కోల్పోయి పడి ఉన్న మహిళను చూసిన స్థానికులు వెంటనే బోధన్లోని జిల్లా ఆస్పత్రికి
తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు.
Tags :
thieves |
cut off |
a woman |
nose |