కరోనా నేపథ్యంలో ఆ జిల్లాలో గణేష్ మండపాలకు అనుమతి లేదు ..
By: Sankar Mon, 17 Aug 2020 5:26 PM
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాలకు ఎర్పాటుకు అనుమతి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకటన చేశారు.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామూహిక పూజలతో పాటు గణేష్ మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. కావున ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్లలో విగ్రహాల ఏర్పాటు నిషేధమన్నారు. అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు ఉత్తుర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ స్పష్టం చేశారు.