తండ్రి మరణవార్త విన్న తరువాత కూడా మ్యాచ్ లో పాల్గొని ఆడిన వెస్టిండీస్ పేసర్
By: chandrasekar Fri, 04 Dec 2020 5:37 PM
వెస్టిండీస్ మరియు
న్యూజిలాండ్ మధ్య టెస్ట్ క్రికెట్ జరుగుతన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ టీంలో
పేస్ బౌలర్ కెమర్ రోచ్ తండ్రి ఆండ్రూ
స్మిత్ బుధవారం కన్నుమూశారు. మ్యాచ్కు సిద్ధమవుతుండగా తండ్రి మరణవార్త విన్న రోచ్
కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం విండీస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.
హామిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి
టెస్టు ఆరంభమైన విషయం అందరికి తెలిసిందే.
తన తండ్రి చనిపోయినా కూడా
రోచ్ గురువారం మ్యాచ్ లో పాల్గొన్నాడు. న్యూజిలాండ్ లో జరుగుతున్న ఈ టెస్ట్
మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్మన్ టామ్ లాథమ్ వికెట్ తీసిన తర్వాత రోచ్
మోకాళ్లపై కూర్చొని కాసేపు అలానే ఉండిపోయాడు. రోచ్ తండ్రి స్మిత్ మృతికి
సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు చేతికి బ్లాక్
బ్యాండ్స్ ధరించి ఇక్కడ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ల్లో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 2
వికెట్లకు 243 పరుగులు చేసింది.