భారతీయ యువకుడి కీలక పాత్ర.. జో బైడెన్ విజయం వెనుక...
By: chandrasekar Fri, 13 Nov 2020 4:24 PM
పలువురు భారత సంతతి
వ్యక్తులు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్
విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత సంతతి
ఓటర్లు మద్దతు కూడగట్టడంలో వీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమైయ్యాయి. జో బైడెన్
బృందంలోని ఓ 30 ఏళ్లు భారతీయ అమెరికన్ యువకుడు అమిత్ జానీ చురుకైన
పాత్ర పోషించి, ఆసియన్ అమెరికన్లను ఏకతాటిపై నడిపించాడు. గుజరాత్లోని
రాజ్కోట్కు చెందిన అమిత్ జానీ.. నేషనల్ ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్
ఐలాండర్ విభాగానికి డైరెక్టర్గా సారథ్యం వహించారు. అమెరికాలోని ఆసియన్ పసిఫిక్
సంతతి ఓటర్లు బైడెన్వైపు మొగ్గుచూపేలా గతంలో ఎవరూ చేయని రీతిలో వినూత్న ప్రచార
విధానాన్ని తయారు చేసారు. ఇందులో 14 ఆసియా పసిఫిక్ జాతులను భాగస్వామ్యులను చేస్తూ కీలక
రాష్ట్రాల్లో లీడర్షిప్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.ఇందులో ఆరు భారతీయ భాషలు సహా 20 ఆసియా
పసిఫిక్ భాషలకు ప్రాతినిధ్యం కల్పించారు. పెయిడ్ మీడియా, డిజిటల్
ప్రకటనల కోసం ఒక్కో కౌన్సిల్లో ఏడుగురిని నియమించారు. మొత్తం 300 మంది
సభ్యులతో వాలంటరీ ఆర్గనైజేషన్ రూపొందించారు.
సౌత్ ఆసియన్స్ ఫర్
బైడెన్ టీమ్ రూపకల్పనలో సహకారం అందించారు. బైడెన్కు మద్దతునిచ్చే ఇండియన్
అమెరికన్లు, హిందువులు, సిక్కులు, జైనులు తదితర వర్గాలను దీని ద్వారా ఏకతాటిపైకి
వచ్చారు. భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న అమెరికాలోని భారతీయ ప్రముఖల నేతృత్వంలో భారీ
వర్చువల్ ఈవెంట్ నిర్వహించారు. ఇది అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా
నిలిచింది. ప్రైమరీ ఎన్నికల సమయంలో బైడెన్ బృందంలో అమిత్ చేరారు. కొద్ది నెలల్లోనే జాతీయస్థాయిలో ప్రచార విధానానికి
రూపకల్పన చేశారు. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికకావడం సహా ఆసియన్ ఓటర్లలో 71 శాతం
మంది డెమొక్రాట్లవైపు మొగ్గుచూపేలా చేశారు. ఇలా బైడెన్ అధ్యక్ష పీఠాన్ని
అధిష్ఠించేలా విజయం సాధించారు. ‘మేము రికార్డు స్థాయిలో ఓటు వేయబోతున్నామని
భావించాం.. అది అమిత్, ఆయన బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నం.. వారు యునైటెడ్
స్టేట్స్ అంతటా సమాజాన్ని సమీకరించి ప్రేరేపించారు’ అని అమెరికా-ఇండియా బిజినెస్
కౌన్సిల్ ప్రెసిడెంట్ నిశా బిస్వాల్ అన్నారు. డెమొక్రాటిక్ పార్టీ రాజకీయాల్లో జైన్
దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్నారు.
‘అమిత్ ఆసియా అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ సమాజం కోసం
అవిశ్రాంతిగా పనిచేస్తున్నారు. అధ్యక్షుడు బైడెన్, వైస్-ప్రెసిడెంట్ కమలా
హ్యారిస్లకు అద్భుతమైన ప్రతినిధి.. మేము ఒక సమాజంగా గొప్ప ప్రగతి సాధించాం. దాని
కోసం అతను చాలా కృషి చేశాడు’ అని మాజీ క్యాబినెట్ సెక్రెటరీ క్రిస్ లూ అన్నారు.
‘తల్లిదండ్రులు తమ పిల్లలు వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు కావాలని, వ్యాపారాల్లో రాణించాలని
ఒత్తిడి చేశారు.. ఏదేమైనా ఈ దేశంలో మన సమాజం గొంతును వినిపించాలనుకుంటే, దాని
విధానాలు అమెరికా దిశలో ప్రభావం చూపాలని కోరుకుంటే రాజకీయాల ద్వారా పిల్లలను ప్రజా
సేవలో ప్రవేశించడాన్ని ప్రోత్సహించడం ప్రారంభించాలి’ అని కొన్నేళ్ల కిందట ఆసియా
టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ జానీ అన్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో
జన్మించిన అమిత్.. ఏడాది వయసులో తల్లి వెంట అమెరికా వెళ్లారు.