నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
By: chandrasekar Thu, 26 Nov 2020 11:31 AM
షేర్ లు అమ్మకాలు
పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో
ప్రారంభమైన ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుస భారీ లాభాల తర్వాత
బుధవారం ఒక్కసారిగా పతనమయ్యాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన
మార్కెట్లు అంతకంతకు పడిపోయాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో
ప్రారంభమై ఆల్ టైం గరిష్టం 44,825.03ను, నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 13,143 పాయింట్లను తాకింది.
దీంతో లాభాలు ఓ గంట
మాత్రమే కనిపించాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు క్రమంగా క్షీణించి, ఉదయం
గం.10.30
సమయానికి నష్టాల్లోకి వెళ్ళింది. దీంతో మళ్ళీ కోలుకోలేదు. చివరి గంటలో అమ్మకాలు
జోరందుకోవడంతో సెన్సెక్స్ 44వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 13వేల
పాయింట్ల కిందకు వచ్చింది.
అందువల్ల టాప్ గెయినర్స్
జాబితాలో ఓఎన్ జీసీ 6.18 శాతం,
GAIL 1.99 శాతం, అదానీ
పోర్ట్స్ 1.71 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.20 శాతం, కోల్
ఇండియా 0.57 శాతం
లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐషర్ మోటార్స్ 3.65 శాతం, కొటక్
మహీంద్ర బ్యాంకు 3.24, యాక్సిస్ బ్యాంకు 3.20 శాతం, సన్
ఫార్మా 2.68 శాతం, బజాజ్
ఫైనాన్స్ 2.51 శాతం నష్టపోయాయి.