- హోమ్›
- వార్తలు›
- పెళ్లి మండపంలో నే వదువు ను వదిలి వెళ్ళిన వరుడు... కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పరు...!
పెళ్లి మండపంలో నే వదువు ను వదిలి వెళ్ళిన వరుడు... కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పరు...!
By: Anji Mon, 14 Dec 2020 12:46 PM
వివాహంలో కానుకల ఇచ్చిపుచ్చుకునే విషయంలో మొదలైన వివాదం చిలికి చిలిక గాలివానలా మారినట్టు ఇరు కుటుంబాలు పరస్పరం దాడిచేసుకునే వరకు వెళ్లింది.
అయితే వివాహ తంతు ముగిసిన కొద్దిసేపటికే వధువును వదిలేసి కళ్యాణ వేదిక నుంచి వరుడు వెళ్లిపోవడంతో చివరికి ఈ ఈ వ్యహారమంతా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఇజ్జత్నగర్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచశీల నగర్ ప్రాంతానికి చెందిన రామ్ మోహన్ కుమారుడు అనే యువకుడు స్థానికంగా ఓ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి అశోక్ విహార్కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
దీంతో ఇరువురికీ శుక్రవారం వివాహం జరిగింది. బంధువులు, స్నేహితులు వివాహానికి హాజరై వధూవరులను అశీర్వదించారు.
పెళ్లి తంతు ముగియడంతో వచ్చినవారంతా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో కానుకలు ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఇది పరస్పరం ఇరు వర్గాలు కొట్టుకునేవరకూ దారితీసింది. ఇదే సమయంలో వధువును అక్కడే వదిలేసి వరుడు వెళ్లిపోయాడు.
వధువు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వరుడి తరపునవారు మొండివైఖరి వీడలేదు. దీంతో చివరకు వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.