సరిహద్దుల్లోని పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదులు
By: chandrasekar Sat, 11 July 2020 6:56 PM
పాకిస్తాన్ కు చెందిన
దాదాపు 300 మంది
ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి కశ్మీర్ లోయలో అస్థిరత చేసేందుకు సరిహద్దుల్లో పొంచివున్నారు. వీరు ఏ
క్షణాన్నైనా దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాకిస్తాన్ సైన్యం కవ్వింపు కాల్పులకు
పాల్పడుతోంది. సరిహద్దు ఫెన్సింగ్ కు కోతపెట్టి దేశంలోకి వచ్చేందుకు
ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైనికులు వారి వద్ద పెద్ద
మొత్తంలో ఆయుధ సామగ్రి, పాకిస్తాన్, ఇండియా కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో
సరిహద్దుల్లోని పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదులు తిష్ట వేసి విషయాన్ని
గుర్తించారు.
జమ్ముకశ్మీర్లోని నాగావ్
సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద శనివారం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని
మరోసారి ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లాంచ్ప్యాడ్లలో 250 నుంచి
300 మంది
ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి చొరబడేందుకు వేచి ఉన్నారని సైన్యం పేర్కొన్నది.
ఇదిలావుండగా, ఉత్తర కాశ్మీర్లోని నౌగావ్ సెక్టార్లోని కౌప్వారాలో
శనివారం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
సైన్యం అందుకున్న సమాచారం ప్రకారం, సరిహద్దు వద్ద నిర్మించిన లాంచ్ప్యాడ్లలో పెద్ద
సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని, వారి సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటుందని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్
చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులు
సరిహద్దును దాటి దేశంలోకి రావడం కశ్మీర్లో వాతావరణాన్ని పాడుచేయడానికే అని
అర్థమవుతున్నది. జమ్ముకశ్మీర్లో 'ఆపరేషన్ ఆల్అవుట్' ఆపరేషన్ ను భారత భద్రతా దళాలు నిర్వహిస్తున్నాయి. ఈ
ఆపరేషన్ అన్ని వర్గాల ఉగ్రవాదులను కట్టడి చేయడమే కాకుండా వీరికి నిధులు అందకుండా
ఎన్ఐఏ నిలిపివేసింది. దాంతో జమ్ముకశ్మీర్లో
వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా, సరిహద్దు
దాటి ఉగ్రవాదులను పంపడం ద్వారా వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్
ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తున్నది.