ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తున్న బృందాలు...
By: chandrasekar Thu, 10 Dec 2020 9:50 PM
ఏలూరులో వ్యాధి వెనుక
కారణాలు పూర్తిగా తెలియ రాలేదు. నీళ్లు, ఆహార పదార్థాల వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారు.
ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్
డాక్టర్లు, ఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్సీఐ బృందాలు కారణాలు తెలుసుకోవడానికి
ప్రయత్నిస్తున్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని ఆళ్ల
నాని అన్నారు. ఆ ఇద్దరు ఏలూరు నుంచి వేరే కారణాలతో మరణించారని తెలిపారు. ఇదిలా
ఉంటే డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని విజయవాడ ఆస్పత్రిలో
చికిత్సపొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
బాధితుల సంఖ్య తగ్గుతోందని ఆస్పత్రుల్లో ఉన్నవారు కూడా త్వరగానే కోలుకుంటున్నారని
తెలిపారు. ఇద్దరిలో అప్పారావు టీబీ, గుండె వ్యాధితో మృతిచెందగా, సుబ్బరావమ్మ
అనే పేషెంట్ కోవిడ్ కారణంగా మృతి చెందారంటున్నారు. అలాగే ఈ వింత వ్యాధి వెనుక
కారణాలపై ఆరా తీస్తున్నామని నాని అన్నారు. శుక్రవారం సాయంత్రానికి దీనిపై ఓ
క్లారిటీ వస్తుందంటున్నారు.
ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే
ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట
ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు
కోరారు. కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రాథమికంగా
నీళ్లలో సీసం ఎక్కువగా ఉందని తేలిందంటున్నారు. దీనిపై మరింత స్ఫష్టత రావాల్సి
ఉందన్నారు. మరోవైపు కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే ఉన్నాయి. ఈ అంతు
చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన
కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ
బృందం, ఐపీఎం, ఐఆర్సీఐ
బృందాలు ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి
స్థితిగతులను తెలుసుకుంటున్నాయి. ఎన్ సిడిసి,ఎన్ఐఎన్ అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారని
మనుషులతో పాటు జంతువుల శాంపిల్స్ సేకరిస్తున్నామన్నారు. ఏలూరు చుట్టుపక్కల
గ్రామాలలోను శాంపిల్స్ సేకరిస్తున్నారని. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల శాంపుల్స్ సేకరిస్తున్నారన్నారు.