LG పాలిమర్స్ కు అత్యున్నత న్యాయస్థానం లో చుక్కెదురు.
By: Sankar Tue, 26 May 2020 3:50 PM
సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్కు మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్ను సీజ్ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని.. కంపెనీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది.
Tags :
vizag |