ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు
By: chandrasekar Fri, 27 Nov 2020 10:10 PM
ప్రధాని నరేంద్ర మోడీ
హైదరాబాద్ పర్యటనలో మార్పులు చేయబడింది. ఉన్నట్టుండి ఖరారైన ప్రధాని మోదీ
హైదరాబాద్ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. తొలుత శనివారం, నవంబర్
28
సాయంత్రం నగరానికి రావాల్సిన ప్రధాని
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే హైదరాబాద్కు చేరుకోనున్నారు. హకీంపేట్ ఎయిర్
పోర్ట్కి ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్
బయోటెక్కు చేరుకొని తిరిగి 3 గంటలకి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి దిల్లీకి బయలు
దేరనున్నారు. శనివారం ఉదయం మోదీ వెళ్లాల్సిన పుణె షెడ్యూల్ రద్దు కావడంతో
హైదరాబాద్కి ముందుగానే చేరుకుంటున్నారు. పుణెలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో
పర్యటించేలా ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. దీని తర్వాత సాయంత్రం 4
గంటలకు మోదీ హైదరాబాద్కు వచ్చేలా ప్రణాళిక చేశారు. ఇప్పుడు పుణె ప్రోగ్రాం రద్దు
కావడంతో మోదీ మధ్యాహ్నం 1 గంటలకే హైదరాబాద్ రానున్నారు.
ఈ సారి హైదరాబాద్
మునిసిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు, గ్రేటర్
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అగ్ర నాయకులు వస్తున్న వేళ యూపీ ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ కూడా హైదరాబాద్ రానున్నారు. శనివారం యోగి ఆదిత్యనాథ్ నగరానికి
రానున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం
2
గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 3
గంటలకు జీడిమెట్లకు చేరుకుంటారు. 3 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు మల్కాజ్గిరి
పార్లమెంట్ నియోజక వర్గంలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 6 గంటల
నుంచి పాతబస్తీ శాలిబండలోని అల్కా థియేటర్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో యోగి
ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని ఢిల్లీకి
తిరిగి వెళ్తారు.ఇలా మార్పులు చేయబడింది.