Advertisement

  • బీహార్ ఎలక్షన్స్.....ట్రంప్ కు పట్టిన గతే వారికి కూడా పడుతుంది..శివసేన

బీహార్ ఎలక్షన్స్.....ట్రంప్ కు పట్టిన గతే వారికి కూడా పడుతుంది..శివసేన

By: Sankar Tue, 10 Nov 2020 06:32 AM

బీహార్ ఎలక్షన్స్.....ట్రంప్ కు పట్టిన గతే వారికి కూడా పడుతుంది..శివసేన


అమెరికా ఎన్నికల ఫలితాలే బిహార్‌లోనూ పునరావృతమవుతాయని శివసేన వ్యాఖ్యానించింది. ట్రంప్‌కు పట్టిన గతే బిహార్‌లోనూ నితీశ్‌కు పడుతుందని ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ ప్రచారం ముందు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ నిలవలేకపోయారని.. మోదీ, నితీశ్ ముందు బిహార్ ప్రజలు మోకరిల్లలేదని శివసేన ఉద్ఘాటించింది. అబద్ధాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా జో బైడన్, తేజస్వీ పోరాడారని, అందులో వారిద్దరూ విజయం సాధించినట్లే కనిపిస్తోందని శివసేన వ్యాఖ్యానించింది. ట్రంప్ ఓటమి నుంచి భారత్ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించింది.

దేశాధ్యక్ష పదవికి ట్రంప్ ఎప్పుడూ అర్హుడు కారు. కేవలం నాలుగేళ్లలోనే ట్రంప్‌ను ఓడించి... తాము చేసిన తప్పును అమెరికన్లు సరిదిద్దుకున్నారు.. ఇచ్చిన ఒక్క హామీని ట్రంప్ నెరవేర్చలేదు. ట్రంప్ ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది’ అంటూ మోదీ సర్కార్‌కు శివసేన ఉద్ఘాటించింది. అమెరికాలో కరోనా కంటే నిరుద్యోగమే ఎక్కువగా ఉందని, దీనిని పరిష్కరించాల్సింది పోయిన ట్రంప్ రాజకీయాలు చేశారంది. దాని చుట్టూ తిరుగుతూ, రాజకీయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని శివసేన దుయ్యబట్టింది.

Tags :

Advertisement