యుపీఏ చైర్పర్సన్గా శరద్ పవార్ !
By: Sankar Fri, 11 Dec 2020 3:48 PM
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోనియా గాంధీ స్థానంలో తదుపరి యుపీఏ చైర్పర్సన్గా కొనసాగే అవకాశం ఉంది. సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేనందున యుపీఏ చీఫ్గా కొనసాగడానికి ఆమె ఇష్టపడటంలేదు.
అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఆమె అంత చురుకుగా పాల్గొనడంలేదు. ఇలాంటి సందర్భంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు పవార్ ఆమె అధికారికంగా వైదొలిగిన తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి నాయకత్వం వహించడానికి బాధ్యత తీసుకుంటారని సమాచారం...
కాగా శరద్ పవార్ యూపీఏ ఛైర్మైన్గా బాధ్యతలు స్వీకరించాలని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు ఇంతకుముందు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కూడా కూటమిగా ఉన్నాయి.