Advertisement

  • కంగనా రనౌత్ విషయంలో తగ్గిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కంగనా రనౌత్ విషయంలో తగ్గిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

By: Sankar Thu, 10 Sept 2020 4:58 PM

కంగనా రనౌత్ విషయంలో  తగ్గిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్


బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆఫీస్‌ కూల్చివేతకు, శివసేనకు ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. అదే విధంగా తానెప్పుడూ కంగనాను బెదిరించలేదని, ఆమె ముంబైలో హాయిగా జీవించవచ్చని పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కంగన కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. బీఎంసీ ఈ చర్యను చేపట్టింది. కావాలంటే ఈ విషయం గురించి మీరు మేయర్‌ లేదా బీఎంసీ కమిషనర్‌తో మాట్లాడవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇక సంజయ్‌ రౌత్‌ బుధవారం ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడూ కంగనా రనౌత్‌ను బెదిరించలేదు.

కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాను. అంతే. బీఎంసీ తీసుకున్న చర్యలకు నేను బాధ్యుణ్ణి కాదు. నా వరకు ఆ విషయం ఎప్పుడో ముగిసిపోయింది. కంగన ముంబైకి వచ్చి, ఇక్కడే నివసించడాన్ని స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు..

ఇక ముంబై హైకోర్టు సైతం దురుద్దేశపూర్వకంగానే బీఎంసీ ఈ చర్యకు పూనుకున్నట్లుగా ఉందంటూ మొట్టికాయలు వేసింది. ఇలా అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సంజయ్‌ రౌత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే ఆయన వెనక్కితగ్గారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement