ధర రూ.1,000 తగ్గిన శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ ఫోన్
By: chandrasekar Tue, 21 July 2020 5:12 PM
శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్
స్మార్ట్ ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. అయితే ఇది కేవలం 6 జీబీ
ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ పై మాత్రమే. దీని 4 జీబీ
ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రం అలాగే ఉంది. ఈ
తగ్గింపు ధరతో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.18,499గా ఉంది.
ఇక 4 జీబీ
ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రం రూ.16,499గానే ఉంది. ఇందులో బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్, శాంసంగ్
సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని ముంబైకి చెందిన రిటైలర్ మహేశ్
మొదట ప్రకటించారు.
స్పెసిఫికేషన్లు
దీనిలో 6.5
అంగుళాల హెచ్ డీ+ సూపర్ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్
రేషియో 20:9గా
ఉంది. ఆక్టా కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ
వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ.
దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీనిలో వెనకవైపు నాలుగు
కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా
పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా
పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లను ఇందులో
అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 10
ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్
స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000
ఎంఏహెచ్ గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వెనకవైపు
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాంక్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఈ
ఫోన్ బరువు 192 గ్రాములు.