ప్యాసెంజర్ రైళ్ల ప్రైవేటీకరణకు "రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్" జారీ
By: chandrasekar Fri, 03 July 2020 2:32 PM
లక్నో- డిల్లీ మార్గంలో
నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. తొలి నెలలోనే రూ.70 లక్షల
లాభం వచ్చింది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా
లాక్డౌన్ విధించడంతో దాని ప్రభావం ఇండియన్ రైల్వే పై కూడా పడింది. రైల్వే భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. దాంతో
ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ
మార్గాలను వెతుకుతోంది.
ఇందులో భాగంగానే ప్రైవైట్ ఇన్వెస్టర్ నుంచి పెట్టుబడులు
ఆకర్శించేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తం 109
మార్గాల్లో 151 ఆధునిక ప్యాసెంజర్ రైళ్లను నడిపించే విషయంలో
రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ కొత్త మార్గంలో సుమారు రూ. 30 వేల
పెట్టుబడిని సమీకరించుకోవాలని రైల్వే యోచిస్తోంది. అయితే ప్యాసెంజర్ రైళ్లలో
ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలకడం ఇదే మొదటి సారి.
అయితే ఇంతకు ముందే లక్నో- డిల్లీ మార్గంలో నడించే తేజస్ ఎక్స్
ప్రెస్ నిర్వహణ బాధ్యలను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. తొలి నెలలోనే రూ.70 లక్షల
లాభం వచ్చింది. ప్రైవైట్ భాగస్వామ్యం వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
అందుతాయని ఐఆర్సీటిసి ( IRCTC ) తెలిపింది.