రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో స్పెషల్ ఎడిషన్ లాంచ్
By: chandrasekar Tue, 11 Aug 2020 10:08 AM
ఇప్పుడు రెడ్ మీ నోట్ 8 ప్రో
స్మార్ట్ ఫోన్ లో స్పెషల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఇందులో షియోమీ కోరల్ ఆరెంజ్ కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది.
గత సంవత్సరం అక్టోబర్ లో రెడ్ మీ నోట్ 8 ప్రో మొదట లాంచ్ కావడం విశేషం.
ఇప్పుడు రెడ్ మీ నోట్ 8 ప్రో
మొత్తంగా 5 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ బ్లూ
వేరియంట్ గతేడాది చివర్లో లాంచ్ అయింది. కోరల్ ఆరెంజ్ వేరియంట్ ట్విలైట్ ఆరెంజ్
పేరిట జనవరిలోనే లాంచ్ అయింది.
రెడ్ మీ నోట్ 8 ప్రో
కోరల్ ఆరెంజ్ ధర
ఈ ఫోన్ కు షియోమీ
ప్రత్యేక ధరను నిర్ణయించలేదు. మనదేశంలో రెడ్ మీ నోట్ 8 ప్రో 6 జీబీ
ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. మనదేశంలో ఈ కోరల్ ఆరెంజ్ వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవుతుందో
తెలియరాలేదు.
రెడ్ మీ నోట్ 8 ప్రో
స్పెసిఫికేషన్లు
రెడ్ మీ నోట్ 8
ప్రోలో 6.53
అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ90టీ
ప్రాసెసర్ ను ఉపయోగించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది.
దీనిలో 64 మెగా
పిక్సెల్+ 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా
పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను వెనకవైపు అందించారు. దీనిలో ఫ్రంట్ కెమెరా
సామర్థ్యం 20 మెగా పిక్సెల్ గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10
ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.