రానున్న 24 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన
By: Sankar Thu, 12 Nov 2020 09:00 AM
ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4,5 గంటల్లో అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. ఇక ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి..రెండు తెలుగు రాష్ట్రాలలో చలికి ప్రజలు వణుకుతున్నారు..ఇక ఆ చలికి తోడు వర్షపు సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి