కరోనాపై ప్రధాని అఖిల పక్ష సమావేశం...
By: chandrasekar Mon, 30 Nov 2020 8:00 PM
దేశంలో కరోనా కేసులు మళ్లీ
పెరుగుతున్న కారణంగా.. ప్రధాని మోదీ శుక్రవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
డిసెంబర్ 4వ తేదీన జరగనున్న ఆ భేటీలో లోక్సభ, రాజ్యసభ
ఫ్లోర్ లీడర్లు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ సమావేశం జరగనున్నది. కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులు అమిత్షా, హర్షవర్దన్, రాజ్నాథ్, ప్రహ్లాద్
జోషి, అర్జున్
రామ్ మేఘావల్, మురళీధరన్లు కూడా వర్చువల్ సమావేశంలో
పాల్గొంటారు. ఉదయం 10.30
నిమిషాలకు సమావేశం ప్రారంభం కానున్నది.
ఇప్పటికే విపక్ష ఫ్లోర్
లీడర్లకు ఆహ్వానం పంపారు. అయిదుగురి కన్నా తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలకు కూడా
ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కోవిడ్
కేసుల నేపథ్యంలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసే అవకాశాలు
ఉన్నాయి. తదుపరి పార్లమెంట్ సమావేశాలు జనవరి చివరలో ప్రారంభంకానున్నాయి.