దేశంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఆఫర్
By: chandrasekar Wed, 18 Nov 2020 07:34 AM
దేశంలో విద్యార్థులు
మరియు ఉపాధ్యాయులకు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ మనదేశంలో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్
ప్రోగ్రాంను లాంచ్ చేసింది. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక
లాభాలను అందించనున్నారు. ఈ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా 760
విశ్వవిద్యాలయాలను, 38,498 కాలేజీలను కవర్ చేస్తుంది. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులకు
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.1,000 ఇన్
స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతోపాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు
వెళ్లే వారికి వన్ ప్లస్ యాక్సెసరీల కొనుగోలుపై ఐదు శాతం తగ్గింపును
అందించనున్నారు. ఈ ఆఫర్ను అందుకోవాలంటే అర్హత ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
తాము విశ్వవిద్యాలయం లేదా కాలేజీకి వెళ్తున్నామని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ధ్రువీకరణ కోసం వన్ ప్లస్ స్టూడెంట్ బీన్స్తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వినియోగదారుల వన్ప్లస్ ఖాతాకు కూపన్ వోచర్ను
పంపిస్తారు. అర్హత ఉన్న వినియోగదారులు అక్కడ ధ్రువీకరించుకోవచ్చు
ఇందుకోసం
ద్రువీకరించుకున్న తరువాత ఎన్రోల్ అయిన విద్యార్థులు, ఫ్యాకల్టీ
సభ్యులు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుకోవడానికి అర్హులుగా గుర్తించబడుతారు. ఈ స్పెషల్
ఆఫర్ ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే
పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వన్ ప్లస్ ఆడియో డివైస్లు, కేసెస్పై
ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వోచర్ను కేవలం విద్యార్థులు, ఫ్యాకల్టీ
సభ్యులు మాత్రమే ఉపయోగించుకోగలరు. సంవత్సరం తర్వాత ఈ వోచర్ ఎక్స్పైర్ అవుతుంది.
ఎక్స్పైర్ అయ్యాక కొత్త వోచర్ కోసం మళ్లీ ధ్రువీకరించుకోవాలి. వన్ ప్లస్ తాజాగా
మనదేశంలో వన్ ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో రెండు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో 8 జీబీ
ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి
ఫీచర్లు ఉన్నాయి. 65W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని
ద్వారా ఈ ఫోన్ 39 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.